calender_icon.png 23 October, 2024 | 5:09 AM

కొడుకును చంపిన తండ్రి

08-07-2024 06:37:14 PM

బెల్లంపల్లి : కుటుంబ కలహాలతో తండ్రి కొడుకును చంపిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకనపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఆకనపల్లి గ్రామానికి చెందిన దేవ మారాలు (50)కు కొడుకు దేవ వినోద్ (26)కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ మారాలు తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా కొడుకు వినోద్ అక్కడికి వెళ్లి తండ్రితో గొడవపడ్డాడు.

ఆవేశం ఆపుకోలేక తండ్రి తన చేతిలో ఉన్న పారతో మొదడంతో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాళ్ల గురజాల ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వినోద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని శవపరీక్ష నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేష్ తెలిపారు.