రాజాపూర్ (విజయక్రాంతి) : తనయుడు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన రాజపురం మండలంలో రాయపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కావలి నారాయణ (56) అనే వ్యక్తిని మృతుడి కుమారు కవాలి నందు 36కు మతిస్థిమితం సరిగలేదని గురువారం రాత్రి గొడ్డలితో దాడిచేసి కిరాతకంగా హత్య చేశాడు. హత్య విషయం తెలుసుకున్న ఎస్సై రవినాయక్ పోలీసులు గురువారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.తండ్రిని దారుణంగా హత్య చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రవినాయక్ తెలిపారు.