calender_icon.png 12 October, 2024 | 1:58 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకు మృతి

10-10-2024 12:04:17 AM

నిర్మల్, అక్టోబర్ 9: రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్‌ాతురాటి గ్రామాల మధ్య బుధవారం జరిగింది. మన్మద్‌కు చెందిన సంగం సురేష్(27) గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం కొడుకు దీక్షిత్(7)తో పా టు కుటుంబసభ్యులతో కలిసి కారు లో కుచులాపూర్ నుంచి మన్మద్‌కు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న సురేష్‌తోపాటు దీక్షిత్‌కు తీవ్రగాయాలై మృతిచెందారు. సురేష్ భార్య, కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి.