calender_icon.png 25 October, 2024 | 2:53 AM

తండ్రీకొడుకుల ప్రాణం తీసిన పెంపుడు కుక్క

26-06-2024 01:47:43 PM

విశాఖ: పెంపుడు జంతుల్లో అందరూ ఇష్టం పెంచుకునేది కుక్కలు. కానీ ఆ పెంపుడు కుక్కే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలు చాలా చూశాం. తాజాగా పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ,కొడుకు మృతిచెందిన విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం - భీమిలిలో చోటుచేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వాళ్ల ప్రేమగా పెంపుడు కుక్క కరిచింది. ఈ సంఘటన జరిగిన రెండ్రోజులకే కుక్క మృతిచెందింది. అనుమానం వచ్చి అప్రమత్తమైన కుటంబసభ్యులు తండ్రీకొడుకుకు యాంటీ రేబిస్ ఇంజక్షన్ వేయించారు. కానీ అప్పటికే వారికి మెదడు, కాలేయం భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. కుటుంబంలో తండ్రీకొడుకు మరణించడంతో  కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.