09-04-2025 01:00:52 AM
రేపటి నుంచి కొత్త స్లాట్ బుకింగ్ విధానం
ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో
చట్టసవరణతో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు సమర్థవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని రాష్ర్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇందులోభాగంగానే డాక్యుమెం ట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసు కురాబోతున్నామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి పేర్కొ న్నారు. రాష్ర్టంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకుగాను మొదటిదశలో ప్రయోగాత్మకంగా 22 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
సబ్రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజువారి పనివేళలను 48 స్లాట్లుగా విభజించడం జరిగిందన్నారు. ప్రజలునేరుగా ‘rigistration.telang ana.gov.in’ వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు. స్లాట్బుక్ చేసుకోనివారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతీరోజు సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరు గా కార్యాలయానికి వచ్చినవారికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరిస్తామన్నారు.
పైలట్ ప్రాజెక్టు కార్యాలయాలు ఇవే..
హైదరాబాద్లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (ఆర్ఓ), మేడ్చల్ (ఆర్ఓ), మహబూబ్నగర్(ఆర్ఓ), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
అదనపు సిబ్బంది నియామకం..
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్రిజిస్రా ర్లకు తోడుగా అదనపు సబ్రిజిస్ట్రార్లను నియమిస్తామని, ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్రిజిస్ట్రార్లు, ఇతర సిబ్బందిని నియమించడం జరిగిందని, దీంతో కుత్బుల్లాపూర్ కార్యాల యంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.
స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను రీఆర్గనైజేషన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట సబ్-రిజి స్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేయడం జరిగిందన్నారు.
దస్తావేజులను స్వయంగా తయారు చేసుకోవచ్చు..
రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారుచేసుకోవడానికి వెబ్సైట్ లో ఒక మాడ్యూల్ను ప్రవేశపెట్టామని మొదటగా సేల్డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుందని ఇది కూడా ఐచ్చికమేనని తెలిపారు.
రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపైన అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు, సాక్షులు, సబ్రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా లేదా భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వల్ల దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతోందని, దీంతో ప్రజల సమయం వృథా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమయం వృథా కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ ప్రవేశపెడుతున్నామని,ఈనెల చివరిలోగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
డబుల్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ
ప్రతీరోజు ఎక్కడో ఒకచోట తమ ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫి ర్యాదులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్లను నివా రించడానికి చట్టాన్ని సవరించబోతున్నామని పొంగులేటి తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్కు సంబంధించి వివిధ రాష్ట్రా లు ఇప్పటికే చట్టాలను సవరించుకున్నాయని, అదేవిధంగా తెలంగాణలో కూడా చట్టసవరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, రిజిస్ట్రేషన్ చట్టం లో కొత్తగా సెక్షన్ 22కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బీ తీసుకొస్తామని తెలిపారు.