calender_icon.png 16 March, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటి కోసం రైతులు రాస్తారోకో

16-03-2025 04:35:28 PM

చేగుంట (విజయక్రాంతి): సాగునీటి కాలువ కోసం గజ్వెల్ నుండి చేగుంటకి వచ్చే దారిని కసాన్ పల్లి, చందయి పెట్, మాచిన్ పల్లి, పోతన్ పల్లి గ్రామ రైతులు రాస్తారోకో చేయడం జరిగింది, సంఘటన స్థలానికి చేరుకున్న దౌల్తాబాద్ పోలీసులు, ఎస్ఐ ఇరిగేషన్ డిఈ, తోగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ తో రేపు మాట్లాడి న్యాయం చేస్తా అని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింప చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ... రామాయంపేట వెల్ కెనాల్ నుండి మా గ్రామాలకు నీళ్ల ఇవ్వండి, మా ఎనిమిది గ్రామాల ప్రజలు బతుకుతారు, అలాగే రామాయంపేట వెల్లే కెనాల్ నుండి కేవలం 100 మీటర్ వరకు చిన్న కాలువ తీస్తే మాకు నీళ్ల వస్తాయి, మేము ఎన్ని సార్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అలాగే అధికారులకు విన్నవించిన ఎవరు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు కొండ సురేఖ, అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దీనిపైన వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.