26-03-2025 07:53:40 PM
కొల్చారం (విజయక్రాంతి): రైతులు సాగునీరు పొదుపుగా వాడుకొని పంటలను పండించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి సూచించారు. వరి పంట పొలాల సందర్శనలో భాగంగా బుధవారం నాడు మండల పరిధిలోని ఎనగండ్ల గ్రామంలోని వరి పంట పొలాలను పరిశీలించారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వలన నీటి ఎద్దడి నిలగా ఉంటుందని రైతులు పంటలకు నీటిని పొదుపుగా వాడుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అంబిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.