10-04-2025 07:50:25 PM
జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): రైతులు తాము పండించే వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రారంభించబోయే వరి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతిలాల్ సూచించారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల రైతు వేదికలో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అందుకోవాలని దళాలకు అమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు.
బెల్లంపల్లిలో డివిజన్ సంబంధించిన రైతుల వరి ధాన్యాన్ని కొత్తగా ప్రారంభించబోయే వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నట్లు అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ పేర్కొన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట బెల్లంపల్లి ఆర్డీవో బి హరికృష్ణ, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ డి ఆర్ డి ఓ కిషన్ బెల్లంపల్లి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ నరేందర్ ఎంపీడీవో మహేందర్ డి సి ఓ తదితరులు పాల్గొన్నారు.