22-04-2025 12:42:49 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి) అకాల వర్షాలతో వరి, మొక్కజొ న్న, మామిడి పంటలు దెబ్బ తినడంతో పా టు మొక్కజొన్న దాన్యం పూర్తిగా తడిసి ము ద్దయిందని తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిఎస్పి జిల్లా ఇం చార్జ్ పృథ్వీరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు.
సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట వివరాలను న మోదు చేసి నష్టపరిహారం అందేలా రైతులను ఆదుకోవాలని వర్షానికి తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట బీఎస్పీ నేతలు ఉన్నారు.