calender_icon.png 19 October, 2024 | 2:33 PM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

19-10-2024 12:43:44 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని నార్నూర్ మండల కేంద్రములో వ్యవసాయ మార్కెట్ వద్ద సోయా బీన్ కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్మడానికి వస్తే ఇలాంటి ఆంక్షలు విధించకుండా గిట్టుబాటు ధర చెల్లించాలని అధికారులకు సూచించారు. రైతులు నాణ్యమైన సరుకును తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కనక మొత్తు బాయి , మాజీ వైఎస్ ఎంపిపి జాదవ్ చంద్రశేఖర్ , ఫాక్స్ చైర్మన్ ఆడే సురేష్, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెస్రం హన్మంతరావు ,సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్ , మాజీ మార్కెట్ వైఎస్ చైర్మన్ తోడషం నాగోరావు , బిఅర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయీద్ కాశీం, మడవి మన్కు, బీంపూర్ మాజీ సర్పంచ్ రాథడ్ విష్ణు, పుసిగూడ మాజీ సర్పంచ్ రూప్ దేవ్, మహిళా అధ్యక్షురాలు రాథోడ్ దేవకా బాయి, ఆడే సునితా బాయి, టౌన్ ప్రెసిడెంట్ ఫేరోజ్ ఖాన్, లోకండే చంద్ర శేఖర్, సుల్తాన్ బాబా ఖాన్, రాథోడ్ రమేష్, అడ శ్రీరామ్ , టౌన్ వైస్ ప్రెసిడెంట్ రాథోడ్ శివాజీ , షేక్ మసుద్ , సయీద్ ముంతాజ్ , బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పాల్గొన్నారు