calender_icon.png 3 April, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి

27-03-2025 01:03:23 AM

  1. ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలు..
  2.  నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి....
  3.  ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి 

గద్వాల , మార్చి  26 (విజయక్రాంతి): ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండల పరిధిలోని కొండాపురం ,వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను స్థానిక నాయకులు బాసు హనుమంతు నాయుడు  ఆధ్వర్యంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  పరిశీలించి,రైతులతో మాట్లాడి,జిల్లా కలెక్టర్  సంతోష్ , ఎస్ ఏ రహిముద్దీన్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు.

అనంతరం, జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మం త్రి మాట్లాడారు . రాష్ట్రంలో నీరు సరఫరాలో ప్రభుత్వం రైతాంగానికి ఇబ్బందులు కలిగించడం వల్ల ఎక్కువ పంటలు ఎండిపోతున్నాయన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీల్లో ఏ పథకం కూడా సవ్యం గా సాగడం లేదనన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలు ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే అట్టర్ ప్లాఫ్ అయ్యాన్నారు.

ఏ గ్రామంలో చూసినా భరోసా, రుణమాఫీ అందని రైతులు కోకొల్లలుగా ఉన్నారన్నారు. వీటికి తోడు మళ్లీ వేసిన పంటలు సహితం ఇలా నీళ్లు కరెంటు సమస్యలతో ఎండిపోతుంటే రైతుల బాధలు చెప్పనలవి కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 448 మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.

ప్రభుత్వంలో ముగ్గురు మంత్రు లు ఆర్థిక,వ్యవసాయ, విద్యుత్శాఖల సమన్వయంతో పని చేస్తే.. గ్రామాల్లో ఒక్క పంట కూడా ఎండిపోయేది కాదని, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు సక్రమంగా అమలు జరిగినా రైతుల మరణాలు ఉండేవి కాదన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సీఎంకు మాజీ సీఎంపై దుమ్మెత్తి పోయడం తప్పా మరొకటి లేదన్నారు. ఎండిన పంటలకు ప్రభు త్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రా ములు,మాజీ గ్రంథాలయ చైర్మన్ పటేల్ వి ష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు,కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.