calender_icon.png 21 October, 2024 | 12:51 AM

రైతులకు రైతు భరోసా చెల్లించాల్సిందే

20-10-2024 04:46:25 PM

ములుగు మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై బిఆర్ఎస్ నాయకుల రాస్తారోకో 

గజ్వేల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రైతు భరోసా వెంటనే చెల్లించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు జుబేర్ పాషాలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎగవేసి రైతులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు  రైతులకు వెంటనే రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజి జెడ్పీటీసీ అర్జున్ గౌడ్, మాజీ ఎంపిటిసిల పోరం అద్యక్షులు లింగ రెడ్డి, సీనియర్ నాయకులు అన్ని గ్రామాల సర్పంచలు పాల్గొన్నారు.