calender_icon.png 4 October, 2024 | 8:38 PM

జగిత్యాల కలెక్టరేట్ కు మండలాల నుండి తరలొచ్చి కదం తొక్కిన కర్షకులు

04-10-2024 05:26:41 PM

జగిత్యాల (విజయక్రాంతి) : ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చి గద్దె నెక్కాక హామీల అమలు మర్చిపోయారని ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీల అమలు చేయాలని శుక్రవారం కర్షకులు జగిత్యాల కలెక్టరేట్ కు వివిధ మండలాల నుండి కడంతొక్కి తరలొచ్చారు. రుణ మాఫీకి రైతులకు షరతులు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రుణమాఫీ కానీ రైతులు లక్షల మంది ఉన్న ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్ కి 500 బోనస్ ఇస్తానని మాట తప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తానని అనడం సరికాదన్నారు. సన్న వడ్లకు మద్దతు ధర కన్నా మార్కెట్లో అదనంగా ఉందని, ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం హాస్యస్పదంగా ఉందని రైతు నాయకులు వెల్లడించారు.