స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చీమలపాటి రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారన్నారు. త్వరలోనే రైతు భరోసాపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీలైనంత తొందరగా ఇందిరమ్మ కమిటీలు పూర్తి తర్వాత ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, మార్కెట్ డైరెక్టర్లు గాదే రమేష్ పటేల్, తోటకూర రమేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, గాదె మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.