30-03-2025 12:00:00 AM
ఒక పక్క మార్కెట్లో బంగారం ధర ధగధగలాడుతోంది. మరోవైపు టమాటా, మిర్చి, ఉల్లి, మునగ, పత్తి, చీనీ, సపోటా, కళింగర, దోస ధరలు నేల చూపు చూస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల మార్కెట్లో స పోటా, చీనీ, జామకు మార్కెట్ లేదు. ట మాటా రైతుల పరిస్థితి దయనీయంగా త యారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటాకు ధర రాక దిగాలు పడే పరిస్థితి నెలకొంది.
రైతును దోచేస్తున్న దళారులు
ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి అ మ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. మార్కెట్టుకు తీసుకువచ్చిన టమాటా ధర కిలో రెండు రూ పాయలకు పడిపోవడంతో అక్కడక్కడా రైతులు రోడ్డుపై పారబోసి, పశువులకు మేతగా వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చు విపరీతంగా పెరగడంతో సుదూర ప్రాంతాల్లో మార్కెట్కు సరుకు తరలించలేక పోతున్నారు. గత ఐదు సం వత్సరాల నుండి ధరల స్థిరీకరణ అనేది లేదు. అనంతపురం చీనీ మార్కెట్ యార్డ్ లో కమిషన్ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లే దు. అమ్మకాలను వేలం ద్వారా నిర్వహించాలని పలుమార్లు రైతుసంఘాలు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు.
ప్రస్తుత కమిషన్ పది శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించినప్పుడే రైతు బాగుపడతాడు. మార్కెట్లలో ’ఈనం వ్యవస్థ’ (కమీషన్లు) కారణంగా నారింజ రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. చీనీ మా ర్కెట్ యార్డ్లో అమలులో ఉన్న ’ఈనం వ్యవస్థను’ రద్దు చేసి , వేలం ద్వారా అమ్మకాలు నిర్వహించాలి. ప్రస్తుతం చీనీ మార్కె ట్లో డబుల్ సూట్ అని ఇరవై శాతం, తరు గు అని కొంత, అన్లోడింగ్ అని కొంత, మార్కెట్లో సెక్యూరిటీకి కొంత, వే బ్రిడ్జీ కొంత, వట్టికాయలకు కొంత తీసివేస్తే చివరికి రైతుకు మిగిలేది కొంతే. ఇంకా దు ర్మార్గంగా రైతు అవసరాన్ని బట్టి తోటల దగ్గరే 30 శాతం తగ్గించి స్పాట్లో డబ్బు ఇచ్చి కొంటున్నారు. మార్కెట్లకు తరలించి న రైతులు నిర్ణీత సమయానికి రాలేక, వే లం పాటలు పాడలేక పోతున్నారు.
మార్కె ట్ యార్డులు దుర్భరంగా ఉండటం, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా రు. తిండీ తిప్పలు దేవుడెరుగు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతుంటే, మా ర్కెట్లో మాత్రం కొనే పరిస్థితి లేదు. ఎన్నో కష్టాలు పడి టమాటా సాగు చేస్తే మార్కె ట్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శించడం సరికాదని వాపోతున్నారు. రైతు నిర్ణ యించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణ యం తీసుకోవడం ఏమిటి? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బూటకపు మా టలు మాట్లాడుతున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా సం బరాలు జరుపుకుంటున్నారు.
మామిడిదీ అదే పరిస్థితి
ఈ సంవత్సరం టమోటాతో పాటు మామిడి పండ్లకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. పండ్ల తోటల్లో మామిడి పంట చాలా ప్రముఖమైనది. ప్రపంచం మొత్తం లో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భా రత దేశంలోనే జరుగుతోంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడిని చా లామంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు. మా మిడిని మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదా వరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు.
మామిడిని పం డించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం కాపు సంతృప్తికరంగా ఉన్నా మార్కెట్లో ధర లేకపోవడంతోపాటు అకాల వర్షాలతో పంట దెబ్బతినింది. అలాగే కోయకుండా చెట్టుపైన ఉన్న కాయలకు ఉజి ఈగ బెడద ఎక్కువగా ఉంది. నిండా కాపు ఉన్న చెట్టు కాయలకు వెయ్యి నుంచి రెండువేల వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు. మూడువందల చెట్లకు మూడు లక్షల రూపాయలకు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడి జీతానికి సరిపోయేటట్లు ఉంది. రైతుకు పెట్టు బడి రాక చెట్లు తీసివేసే ప్రమాదం ఉంది.
గత దశాబ్ద కాలంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, ధాన్యం నిల్వ చేసుకోవడానికి వేర్హౌస్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అసమర్థ రవాణా వ్యవస్థ కారణంగా పెద్ద మొత్తంలో కూరగాయలు పొలాలలో కుళ్లి పోతున్నాయి. సరఫరా గొలుసు (సప్లు చైన్)అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడం, దాని సంక్లిష్టతలు సా ధారణ రవాణాకు మించినవి. సరఫరా గొ లుసు వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, డెలివరీతో సహా వివిధ దశలను కలిగి ఉంటుంది. ఇవ న్నీ ఉత్పత్తులు తమ ఉద్దేశించిన గమ్యస్థానాలకు సమర్థవంతంగా చేరుకోవడానికి దోహదం చేస్తాయి.
ఆత్మహత్యలు ఓ సంక్లిష్ట సమస్య
రైతు ఆత్మహత్యల సమస్య నిజానికి ఒక విషాదకరమైన సంక్లిష్టమైన సమస్య. ఇది సరఫరా గొలుసు సవాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా బహుళ కారణాలతో ప్రభావితమవుతుంది. అస్థిరమైన మార్కె ట్ ధరలు, అధిక ఇన్పుట్ ఖర్చులు, రు ణం బీమాకు సరిపడా ప్రాప్యత, నీటి కొర త, పంట వైఫల్యాలు, పరిమిత మార్కెట్ అవకాశాలు వంటి అనేక సవాళ్లను రైతు లు ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లు, ఇతర సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత అంశాలతో కలిపి రైతు ఆత్మహత్యల బాధాకరమైన పరిస్థితికి దోహదపడుతున్నాయి. సరఫరా గొలుసు రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుండగా, రైతు ఆత్మహత్యలు విస్తృ త వ్యవస్థాగత సమస్యలు, వ్యక్తిగత పరిస్థితుల కలయికనుండి ఉత్పన్నమవుతున్నా యి.
వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. రైతు ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడానికి వ్యవసాయ సంస్కరణలు, సామా జిక మద్దతు వ్యవస్థలు, మానసిక ఆరోగ్య అవగాహన, ఆర్థిక సహాయం స్థిరమైన వ్యవసాయ పద్ధతులతో సహా సమగ్రమైన బహుళ -డైమెన్షనల్ విధానాలు అవసరం. మెరుగైన మౌలిక సదుపాయాలు, మార్కెట్లకు ప్రాప్యత, సరసమైన ధరల విధా నాలు సమర్థవంతమైన లాజిస్టిక్స్ వంటి వ్యవసాయ సరఫరా గొలుసును మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు తక్షణమే కోల్డ్ స్టోరేజి యూనిట్లు, మార్కెట్ సౌక ర్యం, వేర్హౌస్ల నిర్మాణం చేపట్టాలి. రైతులు ధాన్యం నిలువ చేసుకోవడానికి గోదాములు, గిడ్డంగులు ఏర్పాటు చేయా లి.
రవాణా ఛార్జీలు, ఇతర నష్టాలను కలుపుకొని గతేడాది ఈ సీజన్లో కిలోపై ఐ దు రూపాయలు వ్యయం పెరిగింది . ఈ ఏడాది మాత్రం రవాణాకు వేలు వెచ్చించి చెబుతూ ధరలు ఏకమొత్తంలో పెంచేశా రు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. కూరగాయల ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో ఆందోళనలను రేకెత్తించింది. ధరల పెరుగుదల వల్ల నిత్యావసర కూరగాయలు అం దుబాటులో లేకుండా పోయాయి. మూ డు సంవత్సరాలుగా వ్యవసాయ సాగు పనుల వ్యయాలు రెట్టింపు అయ్యాయి.
గతంలో టమోటా నార వంద మొక్కలు అరవై రూపాయలు, ఇప్పుడు వంద రూ పాయలు. దుక్కి చేయడానికి, గట్లు చేయడానికి ఎకరాకు రూ.1200 వ్యయం వచ్చే ది. ఇప్పుడు రూ.2500 రూపాయలు. రవాణా, టోల్ చార్జీలు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏ పంట ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలిపే నాథుడే లేడు. వ్యవసాయ అధికారులు గణాంకాలు పూర్తిగా మరచి పోయారు. వ్యవసాయం జూదం గా మారింది. ఎన్నేళ్లయినా ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదు.
డా. యం. సురేష్ బాబు