calender_icon.png 24 October, 2024 | 2:15 AM

ఆవును రక్షించే క్రమంలో రైతు మృతి

02-09-2024 10:54:26 AM

హుస్నాబాద్, (విజయక్రాంతి): కాలువలో ప్రమాదవశాత్తు జారిపడిన ఆవును రక్షించే సమయంలో కాలువలో పడి రైతు బొబ్బల కనకారెడ్డి మృతి చెందిన ఘటన కోహెడ మండలం రామచంద్రపురంలో చోటు చేసుకుంది. పోలీసులు బొబ్బల కనక రెడ్డి (59) రోజువారీగా తనకున్నా రెండు ఆవులకు నీరు పెట్టడానికి తీసుకెళ్లగా ఒక ఆవు అక్కడే ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు  జారగా బయటకు తీయడానికి యత్నించి నీటిలో పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కుమారుడు రమణారెడ్డికి సమాచారం అందించగా వచ్చి చూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు.‌ స్థానికులతో కలిసి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో  కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొబ్బల కనకరెడ్డి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు.