వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట్ గ్రామంలో కరెంట్ షాక్ తో అదే గ్రామానికి చెందిన రైతు గుండెని యాదయ్య(51) చనిపోయాడు. తన సొంత పొలానికి ఇనుప కంచెలకు పంట రక్షణ కోసం కరెంట్ షాక్ ను పెట్టి శనివారం ఉదయం అనుకోకుండా ఇనుప కంచెలను తాకి రైతు యాదయ్య మరణించాడని తన భార్య ఇంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసు వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.