18-04-2025 12:00:00 AM
మంచిర్యాల, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): మంచిర్యాలలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల వీడ్కోలు పార్టీ వేడుకలు మంచిర్యాల గార్డెన్స్లో గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు.
అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు శ్రీకర్, రాజు, ప్రిన్సిపల్ మహేందర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.