జీవా, అర్జున్, పా. విజయ్, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, వామ్ ఇండియాస్ పాన్ ఇండియా స్పెక్టాక్యులర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘అఘతియా’ ఫస్ట్ లుక్ విడుదలైంది. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె. గణేష్ ఇప్పుడు అనీష్ దేవ్ నేతత్వంలోని ఇండియాస్తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘అఘతియా’ను నిర్మిస్తున్నారు. జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రాశి ఖన్నాతో పాటు యూరోపియన్ నటి మటిల్డా, అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం నుంచి ప్రధాన నటీనటులతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇది వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో కూడిన ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందుతోంది.