calender_icon.png 3 October, 2024 | 10:53 PM

మంగంపేటలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే ప్రారంభం

03-10-2024 08:41:39 PM

సర్వే ప్రక్రియను తనిఖీ చేసిన ఆర్ అండ్ బి సెక్రెటరీ హరిచందన

పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ అండ్ బి సెక్రటరీ హరిచందన దాసరి సర్వేను స్వయంగా పరిశీలించారు. ప్రతి కుటుంబ వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలను అర్హులకు అందించేందుకు డిజిటల్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. సర్వే కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈఆర్వో దేవుజా రేణుక రెడ్డి ఎంపీడీవో అరుణారెడ్డి తాసిల్దార్ బిక్షపతి ఎంపీ ఓ రాజ్ కుమార్ ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.