calender_icon.png 28 September, 2024 | 10:54 PM

ఫ్లుఓవర్‌పై బాంబు ఉందని ఫేక్‌కాల్

27-09-2024 02:23:07 AM

నిందితుడి అరెస్టు 

కార్వాన్, సెప్టెంబర్26 : లంగర్‌హౌస్ ఫ్లుఓవర్ వద్ద బాంబు ఉందని డయల్ 100కు ఫేక్‌కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన వివరాలు.. ఈనెల 24న రాత్రి లంగర్‌హౌస్ ఎంప్లాయ్ బాగ్దాద్ కాలనీకి చెందిన అబ్దుల్ ఇమ్రాన్ తన భార్యతో గొడవపడ్డాడు. అయితే తాగిన మైకంలో ఇమ్రాన్  రాత్రి 10:50 గంటలకు లంగర్‌హౌస్‌లోని ఇంద్రారెడ్డి ఫ్లుఓవర్‌పై కొందరు బాంబు పెట్టారని 100కు కాల్ చేసి చెప్పాడు. పోలీసులు ఫ్లుఓవర్ వద్ద తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు లభించలేదు. అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. సెల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.