తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి/నాగారం, సెప్టెంబరు 30: డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.