calender_icon.png 8 October, 2024 | 5:00 AM

‘డబుల్’ ఇళ్లలో వసతులు పూర్తి చేయాలి

08-10-2024 12:00:00 AM

కలెక్టర్ బదావత్ సంతోష్ 

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి)/కల్వకుర్తి: బీఆర్‌ఎస్ ప్రభు త్వంలో కల్వకుర్తి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్పగి ంతపై ‘డబుల్ ఇండ్లను అప్పగిస్తారా?’ అనే శీర్షికన విజయక్రాంతి లో సోమవారం ప్ర చురితమైన కథనానికి కలెక్టర్ బదావత్ సం తోష్ స్పందించారు.

నిరుపేదలకు ఇళ్లను అ ప్పగించేందుకు కావాల్సిన మౌలిక వసతుల ను పూర్తి చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. కల్వకుర్తిలోని 240 డబుల్ బెడ్ రూం ఇండ్లను అధికారుల తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులకు అప్పగిం చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయనవెంట కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, మున్సిపల్ అధికారులు ఉన్నారు.