calender_icon.png 24 October, 2024 | 6:58 AM

డిజిటల్ క్రాప్ సర్వేకు సౌకర్యాలు కల్పించండి

24-10-2024 12:16:09 AM

వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): డిజిటల్ క్రాప్ సర్వేకు తమకు సౌకర్యాలను కల్పించాలని ఏఈవో సంఘాల ప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సం ఘాల ప్రతినిధులు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి దృష్టికి తీసుకుపోయారు. బుధవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స మావేశంలో విజ్ఞప్తి చేశారు. ఏఈవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని డైరెక్టర్ గోపి తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను తక్షణమే ప్రారంభించాలని గోపి కోరారు.