calender_icon.png 7 October, 2024 | 1:34 PM

రుణమాఫీ పూర్తికాగానే.. రైతు భరోసా నిధులు: మంత్రి తుమ్మల

07-10-2024 11:54:20 AM

హైదరాబాద్: ప్రజా పాలనలో భాగంగా గాంధీభవన్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తాము నిత్యం రైతులతో తిరుగుతున్నామని తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే తమకు నిరసన సెగ తాకేదని తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ ఒకరిది.. అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిది అని మంత్రి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ ప్రధాని మోడీకి కనిపించట్లేదా?, రూ. 18 వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి కనిపించట్లేదా?, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తికాగానే రైతు భరోసా నిధులు వేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.