వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో డైరెక్టర్ గుణశేఖర్ది ప్రత్యేక స్థానం. ఆయన దర్శకత్వంలో యుఫోరియా’ అనే యూత్ఫుల్ సోషల్ డ్రామా సిద్ధమైంది. గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమా గుణ నిర్మించారు. విఘ్నేశ్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు.
సోమవారం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది” అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తొంభై శాతం కొత్త వాళ్లే కనిపిస్తారు. ఆడిషన్స్ చేసి, వర్క్ షాపులు చేసి షూటింగ్కు వెళ్లాం. అరవై శాతం షూట్ పూర్తయింది. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి.
కథ రాస్తున్న కొద్దీ సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ కథకు నా భార్య నీలిమ, నా కూతురు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు” అని తెలిపారు. ‘చక్కగా తెలుగు మాట్లాడేవాళ్లు.. థియేటర్ ఆర్టిస్టుల్ని ఈ సినిమాకు తీసుకున్నాం. ఆడియెన్స్ సినిమాను ఆశీర్వదించాలి’ అని నిర్మాత నీలిమ అన్నారు. మూవీ టీమ్ అందరూ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు.