calender_icon.png 18 October, 2024 | 5:54 PM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

18-10-2024 03:33:17 PM

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుక్రవారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాశిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు హరి కిషన్ రావు 45 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దృష్టిలోపం వారిని గుర్తించి బోధన్ లయన్స్ కంటి వైద్యశాలకు ప్రత్యేక వాహనంలో పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వేణుగోపాల్, బాలు, వైద్యాధికారుల అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.