calender_icon.png 24 October, 2024 | 7:44 AM

మంత్రాల నెపంతో తల్లిదండ్రుల గెంటివేత

24-10-2024 01:35:23 AM

కొడుకుపై చర్యలకు ఆర్డీవోకు వినతి  

సూర్యాపేట, అక్టోబర్ 23: బాణామతి వస్తుందన్న నెపంతో కన్న కొడుకే తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. దీం తో తమను ఆదుకోవాలంటూ బుధవారం బాధితులు ఆర్డీవోను ఆశ్రయించారు. బాధితుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆత్మ కూర్ (ఎస్) మండలం కందగట్లకు చెందిన అర్రూరు నరసయ్య, అనసూర్య.. కొడుకు, కోడలు నుంచి వేరుగా ఉంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.

అయితే, మంగళవారం రాత్రి తమ కుమారుడు ఇంటిలో ఉండవద్దంటూ గృహనిర్బంధం చేసి భౌతికంగా దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితిలో బయటకు వచ్చామని వాపోయారు. తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని అతనే సాగు చేసుకుంటూ అన్నం కూడా పెట్టడం లేదని చెప్పారు.

గతంలో గ్రామపెద్దలు పంటకు రూ.ఐదువేలు, పుట్టెడు వడ్లు ఇవ్వాలని నిర్ణయించినప్పటికి.. ఇవ్వకుండా మాన సిక క్షోభకు గురి చేసున్నాడని కన్నీటి పర్యం తమయ్యారు. తమకు న్యాయం చేయాలని సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావుకు వినతిపత్రం అందజేశారు.