హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన రాజీవ్గాంధీ సివిల్స్ అభ య హస్తం పథకం గడువును ఈనెల 12 వర కు పొడిగించినట్లు సంస్థ చైర్మన్, ఎండీ బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధిస్తే సింగరేణి తరఫున రూ.లక్ష సహాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పథకంలో దరఖాస్తుకు ఈనెల 6తో గడువు ముగియడం తో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేర కు ఈనెల 12 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ ఎస్సీసీఎల్మైన్స్.కామ్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.