calender_icon.png 9 October, 2024 | 1:57 PM

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పెంపు

06-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిపాటు పెంచింది. అక్టోబర్ 9 నుంచి రాజేశ్వరరావును ఏడాది కాలానికి పునర్నియమిం చాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజేశ్వరరావు 2020 అక్టోబర్‌లో మూడేండ్ల కాలానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు.