* ఓయూ వీసీకి వినతిపత్రం అందజేసిన పీహెచ్డీ విద్యార్థులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 30( విజయ క్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ 2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థుల పరిశోధన గడువును మరో సంవత్సరం పొడి ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎం కుమార్ను పరిశోధక విద్యార్థులు కోరారు. గురువారం ఓయూ పరిపాలన భవనంలోని సేనెట్ హాల్లో వీసీకి వారు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పరిశోధక విద్యార్తులు మాట్లా 2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2018లో ప్రారంభమై 2019 వరకు కొనసాగిందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన మరు సంవత్సరమే కరోనా కాలంగా రెండు సంవత్సరాలు కోల్పోయామని, తమ ప్రీ పీ ఎగ్జామ్ 2021లో నిర్వహించారని తెలిపారు.
నేషనల్ ఫెలోషిప్, స్టేట్ యూనివర్సిటీల ఫెలోషిప్లు అందక, ఆర్థిక సహా లేక తమ పరిశోధన సకాలంలో పూర్తి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిశోధన కాలపరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగిం వైస్ ఛాన్సలర్ను కో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొ. జితేంద్రనాయక్, పరిశోధక విద్యార్థులు.. కొమ్ము శేఖర్ మాదిగ, వలిగొండ నర్సింహ, క్రాంతి నా అరుణ్ ఆదివాసి, రవి, పద్మ యాదవ్, తప్పెట్ల ప్రవీణ్ ,ఝాన్సీ, శ్రీనివాస్, కాంపాటి వెంకట్, నవీన్, అలేఖ్య, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.