24-02-2025 06:16:56 PM
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్..
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్, కడెం, నుంచి గతంలో ఉదయం ఐదు గంటలకు, రాత్రి 9 గంటలకు, ఆర్టీసి ఎక్స్ప్రెస్ బస్సు సౌకర్యం ఉండేది. వాటిని రద్దు చేయడంతో రెండు మండలాల ప్రజలకు ఆర్థిక భారం పడి, మహాలక్ష్మి పథకానికి నోచుకోకపోతున్నారు. వెంటనే ఈ బస్సులను పునరుద్ధరించి హైదరాబాదు నుంచి 10:15 నిమిషాల బస్సులను కూడా డీలక్స్ కాకుండా, ఎక్స్ప్రెస్ సర్వీసులను పునరుద్ధరించాలని కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు.