29 July, 2026 | 9:13 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

మితం మంచిది!

06-04-2025 12:00 AM

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం తినే ఆహారంలో డ్రైఫ్రూట్స్, తాజా పం డ్లు, కూరగాయలు భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఇవి తినడం వల్ల పోషకాలు మరిన్ని శరీరానికి అందుతాయి. అయితే వీటిని కూడా ఒక పరిమితి ప్రకారం తినాలని, మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

మనం పండ్లను తినాలనుకుంటే అరటిపండు, సీతాఫలం, యాపిల్, పియర్ వంటివి రోజుకి ఒకటి తింటే సరిపోతుంది. బొప్పాయి, కర్బూజ అయితే సగం కప్పు ముక్కలు తింటే సరిపోతుంది. 

తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయంలో పండ్లను జ్యూస్‌గా చేసి తాగడం కంటే నేరుగా తినడమే మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలా అని రోజులో మరీ ఎక్కువ వద్దని సూచిస్తున్నారు. 

రెండు అంజీరా.. బాదం, జీడిపప్పు, పిస్తాలను నాలుగు చొప్పున రోజూ తీసుకుంటే చాలు. ఇవి మొత్తం 30 గ్రాములు లోపు ఉంటే సరిపోతుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి మధ్య వీటిని తీసుకుంటే నీరసం రాదు. ఇతర చిరుతిళ్లు తినాలని అనిపించదు.