13-03-2025 01:00:38 AM
హైదరాబాద్, మార్చి 12: హెచ్ఎండీఏ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించి ంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 16 మండలాలు హెచ్ఎండీఏలో విలీనం కానున్నాయి. సుమారు మూడు వేల చదరపు కిలోమీటర్ల భూ భాగం హెచ్ఎండీఏ పరిధిలోకి కొత్తగా చేరనుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.