calender_icon.png 24 February, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ గెలుపుతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం

16-02-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం

హైదరాబాద్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి): ఢిల్లీ విజయం తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది. దానికి తోడు ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తుందని పలు సర్వేల్లో తెలపడంతో కమలనాథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ  గెలుపు నల్లేరు మీద నడకే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతా కూడా తెరవకపోవడంతో ఆ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే  కరీంనగర్, నల్గొండ స్థానాలకు సంబంధించిన బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, సరోత్తం రెడ్డి...

కరీంనగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ భన్సల్ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.