20-03-2025 06:42:22 PM
ప్రముఖ సంఘ సేవకుడు, అయిత పరంజ్యోతి..
చేగుంట (విజయక్రాంతి): రాష్ట్రంలో చదివే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి భయం లేకుండా, సమయస్ఫూర్తితో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని చేగుంట పట్టణ ప్రముఖ సంఘ సేవకుడు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజం, పాఠశాల తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుందన్నారు. తరగతి గదిలో సంవత్సరం అంత చదివిన విషయాన్ని సమయస్ఫూర్తితో పరీక్ష హాల్లో ప్రజెంటేషన్ చేయడం మీ ముందున్న కర్తవ్యం అని అన్నారు. కష్టపడి పరీక్షల్లో మంచిగా రాసి మీ తల్లిదండ్రులను, గురువులను, పట్టణాన్ని జిల్లాలో రాష్ట్రంలో మంచి పేరు తేవాలని, అలాగే జిపిఎస్ 10 వచ్చిన వారికి తన వంతు సహకారంగా ప్రతి విద్యార్థికి 5000 రూపాయలు నగదు బహుమానం ఇస్తానని అన్నారు.