calender_icon.png 26 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలి

26-02-2025 02:00:52 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి), మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 5 నుండి 25 మార్చి వరకు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో 38 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని, 8743 మంది మొదటి సంవత్సరం, 9726 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని తెలిపారు.ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాయవలసి వుంటుందని తెలిపారు. ఇందుకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్, 38 మంది డిపార్టుమెంటల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సీటింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పదవ తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో 64 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, తెలిపారు. ఇందులో 6127 మంది బాలురు, 6452 మంది బాలికలు పాల్గొన నున్నారనీ తెలిపారు.  16 వొకేషనల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఐదుగురు రూట్ అధికారులు, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడయన్స్, 11 మంది సి సెంటర్ కస్టోడయాన్స్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సీటింగ్ స్క్వాడ్, 698 మంది ఇన్విజిలేటర్ లను నియమించడం జరిగిందని తెలిపారు. 

ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జవాబు పత్రాలను BNPS సిస్టమ్ ప్రకారం పోస్టాఫీసు లలో స్వీకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం, జిల్లా విద్య శాఖాధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, ఆర్టీసీ, పోస్టల్, ట్రెజరీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.