calender_icon.png 27 October, 2024 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటెక్నిక్ లెక్చరర్ ధ్రువపత్రాల పరిశీలన

08-08-2024 01:40:27 AM

సెప్టెంబర్ 20 నుంచి మొదలు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ లెక్చరర్ అభ్యర్థు లకు సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ను చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ బుధవారం తెలిపింది.  జనరల్ అభ్యర్థులను 1:2, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నట్లు ప్రకటించింది.  అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యా లయంలో ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించింది. వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవలంది. వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజ రు కావాలని సూచించింది. చెక్‌లిస్టు లో ఉన్న ధ్రువపత్రాలపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలని అభ్యర్థులకు సూచించింది.