01-03-2025 08:35:05 PM
జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల యూత్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం హంగర్గ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేసినట్లు సభ్యులు మారుతి పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలు ఒత్తిడి లేకుండా రాయాలని సూచించారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు, యూత్ ఫోరం సభ్యులు సాయికర్ణ, మారుతి, బాలాజీ, సుభామ్, దేవిదాస్, సాయినాథ్, శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.