10-03-2025 11:06:18 AM
బ్యాటరీల దొంగతనాలతో అడ్డంగా దొరికిన మాజీ నేరస్తులు
సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్
పెద్దపల్లి,(విజయక్రాంతి): దొంగ తనాలని వృత్తిగా ఎంచుకొని అనేకమార్లు జైలుకు పోయిన జల్సాల మోజు తీరక తిరిగి దొంగ తనలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు బ్యాటరీల దొంగలు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రి నగర్ లో ఈ నెల 3న లారీలకు సంబంధించిన 22 బ్యాటరీలను దొంగతనం చేసిన దొంగలను సుల్తానాబాద్ పోలీసులు చాలా చక్యంగా పట్టుకున్నమని ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా సి సిసి నస్పూర్ గాంధీనగర్ కు చెందిన మోటం శ్రీను( 29 ) గ్రామంలో ఖాళీ బీరు సీసాలు ఏరుకొని విక్రయిస్తూ జీవించేవాడు.
బీరు సీసాలు విక్రయించగా వచ్చిన డబ్బులు తన అవసరాలకు జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేసి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో 2019 సంవత్సరంలో ఈవెల్గటూర్ మండలంలోని రాజారాం పల్లి గ్రామంలో ఓ మొబైల్ షాప్ లో షెటర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడగా, వెల్గటూర్ పోలీసులు శ్రీను ను అరెస్టు చేసి జైలుకు పంపగా తిరిగి బెయిల్ పై వచ్చి మళ్లీ బీరు సీసాలు వ్యాపారం చేస్తూ 2021 సంవత్సరంలో ఇందారం శివారులో జైపూర్ మండలంలో ఓ హార్డ్వేర్ షాపులో సుమారు ఐదు టన్నుల ఇనుము, సీసీటీవీ మానిటర్ డివిఆర్ ను దొంగలించగా జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారని తెలిపారు.
తిరిగి జైలు నుండి వచ్చిన మోటం శీను తన సమీప బంధువు అయినా తూర్పాటి మహేష్( 29) గణేష్ నగర్, అరుణ్ అక్క నగర్ శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లాలో మేస్త్రి పని చేస్తూ జీవించేవాడని మోటం శ్రీనుతో కలిసి ఈనెల 03 న శీను మారుతి జెన్ కారులో కరీంనగర్ కు వెళ్లి తమ పనులు ముగించుకొని తిరిగి రాత్రి 11:30 గంటల సమయంలో మంచిర్యాలకు వెళుతుండగా మార్గమధ్యలో శాస్త్రి నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద లారీలు నిలిపి ఉండడం చూసి దాదాపు రాత్రి 11:30 గంటల సమయంలో 22 లారీల బ్యాటరీలను చోరీకి పాల్పడి తమ కారులో నస్పూర్ కు తరలించి భద్రపరచారని తిరిగి నేడు వాటిని విక్రయించేందుకు కరీంనగర్ తరలిస్తుండగా సుల్తానాబాద్ చెరువు కట్ట సమీపాన పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా అనుమానస్పదంగా కనిపించడంతో తనిఖీచేగా లారీలకు సంబంధించిన 22 బ్యాటరీలు కారులో కనిపించడంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని ఎస్సై తెలిపారు. లారీ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.