calender_icon.png 6 October, 2024 | 5:59 AM

మూసీ ప్రక్షాళనకు ప్రతిఒక్కరూ సహకరించాలి

05-10-2024 01:14:09 AM

  1. ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థవంతగా తిప్పికొట్టాలి 
  2. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మూసీనది ప్రక్షాళనకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనను సీఎం రేవంత్‌రెడ్డి దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మూసీ పక్షాళన కోసం శనివారం నాగోల్‌లో నిర్వహించే సమావేశానికి మూసీ పరివాహక ప్రాంత రైతులు పెద్దఎతున హాజరు కావాలని కోరారు.  ఎస్టీపీలతో మరికి నీటిని శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మూసీ ప్రక్షాళనపై ప్రజలను ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కాంగ్రెస్ నేతలు విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.