calender_icon.png 25 October, 2024 | 5:52 AM

అందరూ ఓటు నమోదు చేసుకోవాలి

25-10-2024 01:18:40 AM

నిర్మల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవాలని పీఆర్‌టీయూ జిల్లా అద్యక్షుడు నరేంద్ర బాబు పిలుపు నిచ్చారు. గురువారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో సంఘం ద్వారా ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహిస్తున్నామని సంఘం ప్రతినిధులు బల్సా గజ్జారాం, మునిధర్ రాజు, స్వామి, శ్రీనివాస్ తెలిపారు.