04-03-2025 06:45:12 PM
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
పాపన్నపేట: నేరాల నియంత్రణలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు నేరం జరిగిన చోట ఉన్నవారు నేరం చేసిన వారిని తక్షణమే పట్టుకొని పోలీసులకు సమాచారం ఇస్తే నేరాల నియంత్రణను తొందరగా చేయవచ్చని ఆయన అన్నారు. జిల్లాలో వివిధ నేరాలలో పాల్గొన్న ఏడుగురు అరెస్టు చేశారు. మంగళవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ లతో కలిసి నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్డే నాగయ్య రంగంపేట, మక్కని నవీన్ శివ్వంపేట, ఉప్పు సాయి కుమార్ శివ్వంపేట, మక్కని నరేష్ శివ్వంపేట, మక్కని పవన్ శివ్వంపేట, వడ్డే శ్రీకాంత్ శివ్వంపేట, వడ్డే నర్సింలు చిన్నఘనపూర్ లు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు.
వీరిపై ఉమ్మడి జిల్లా లోని ఏడు పోలీస్ స్టేషన్ లలో13 కేసులలో నిందితులపై ఎఫ్ ఐ ఆర్ నమోదైందని తెలిపారు. పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం వద్దా భక్తుల మెడలో నుండి బంగారు ఆభరణాల దొంగతనాలలో భాగంగా నమోదైన ఐదు కేసులలో మొత్తం 8. లక్షల విలువైన 121 గ్రాముల బంగారు ఆభరణాలు వారి నుండి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తును వారికి అప్పగిస్తామని తెలిపారు. ఈ నెల 3వ తేదీ రోజు రాత్రి ఏడుపాయలలో పెట్రోలింగ్ చేసే సమయంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న వారిని ప్రశ్నించే క్రమంలో పరరాయ్యేందుకు ప్రయత్నం చేసారు. వారిని పట్టుకుని విచారణ చేయగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని చేందించినందుకు గాను పోలీసు అధికారులకు ఈ సందర్బంగా ఎస్పీ రివార్డులను అందజేశారు. మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, సీసీఎస్ కానిస్టేబుల్స్ దత్తు, ప్రశాంత్, చిట్టిబాబు, ఐటీ కోర్ కానిస్టేబుల్ విజయ్, ఏఆర్ కానిస్టేబుల్ అనిల్, పాపన్నపేట కానిస్టేబుల్స్ యాదగిరి, దుర్గా ప్రసాద్, వసంత్ రావు, నర్సింలు, నిర్మల లను ఈ సందర్బంగా ఎస్పీ అభినందించి రివార్డులని అందజేశారు.