నిర్మాత రాజ్ కందుకూరి :
పీఎల్ విఘ్నేశ్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ప్రణయ గోదారి’. సీనియర్ నటుడు సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ కాగా, సునిల్ రావినూతల ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ప్రమోషన్స్లో భాగంగా శనివారం ఈ చిత్రం గ్లింప్స్ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లా డుతూ.. “ప్రణయగోదారి’ కంటెంట్ చూస్తుంటే అందరికీ నచ్చుతుందనే నమ్మకం కలిగింది. చిత్ర యూనిట్కు అభినందనలు” తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: మార్కండేయ; కెమెరా: ఈదర ప్రసాద్; డిజైనింగ్: టీఎస్ఎస్ కుమార్; కొరియోగ్రఫీ: కళాధర్, మోహనకష్ణ, రజిని; ఎడిటర్: కొడగంటి వీక్షిత వేణు.