calender_icon.png 21 October, 2024 | 1:37 PM

ప్రతి మహిళా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

21-10-2024 11:13:05 AM

సూర్యాపేట: ప్రతి సంవత్సరం విధిగా 35 సంవత్సరాలు నిండిన మహిళలందరూ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. సోమవారం బ్రెస్ట్ క్యాన్సర్ పై మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన 2కె కార్యక్రమాన్ని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని దీనిని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే దీనిని గుర్తించడం ద్వారా నివారించుకునే అవకాశం ఉందన్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొందరికే కాదని ఎవరికైనా రావచ్చునని తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించిన పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మాసాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ భట్, సత్యనారాయణ, రమేష్, యశ్వంత్, ఈశ్వరమ్మ, రాకేశ్ చంద్ర, పావని, రూత్, సునీత, భూలక్ష్మిలు పాల్గొన్నారు.