‘విరాజి’ సినిమా కథానాయకుడు వరుణ్ సందేశ్
మహా మూవీస్, ఎం3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాజి’. ఈ సినిమాను ఆద్యాంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. నేడు (శుక్రవారం) సినిమా విడుదలవుతున్న సందర్భంగా కథానాయకుడు వరుణ్ సందేశ్ గురువారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. “విరాజి’ మూవీలో నా లుక్ కొత్తగా ఉండేలా డైరెక్టర్ హర్ష డిజైన్ చేశారు.
రెండు డిఫరెంట్ కల్చర్స్లో వెరైటీగా హెయిర్ స్టయిల్, ముక్కు పుడక, టాటూస్తో కొత్తగా మేకోవర్ చేయించారు. షూటింగ్లో హెయిర్ కలరింగ్ కోసం 7 గంటలు, టాటూస్ కోసం మరో గంట సమయం పట్టేది. ప్రమోషన్స్లో కూడా ఆ లుక్లోనే పాల్గొంటున్నా. ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవ్వాలంటే ముక్కుపుడక పెట్టుకోక తప్పదుగా మరి!. నా మేకోవర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కానీ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల అందరూ గర్వపడతారు” అని సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పాడు వరుణ్.
తర్వాత కథ గురించి చెప్తూ.. ‘కథ కంటే ముందు డైరెక్టర్ నా క్యారెక్టర్ గురించే వివరించారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర ప్రారంభమయ్యే కథ. ఇందులో అంతర్లీనంగా సోషల్ మెస్సేజ్ ఉంటుంది. కథలో చాలా ట్విస్టులు, టర్న్స్ ఉన్నాయి. సినిమా చూశాక నేను, నా వైఫ్ వితిక భావోద్వేగానికి గురయ్యాం’ అని తెలిపారు. కథ బాగుండి, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మంచి స్టోరీ ఉంటే వెబ్ సిరీస్లలోనూ నటించాలని ఉందని చెప్పాడు వరుణ్ సందేశ్. తనకు పలానా క్యారెక్టర్స్ మాత్రమే చేయాలనే పరిమితులేమీ లేవని, అందుకే ‘మైఖేల్’ చిత్రంలో విలన్గా నటించానని తెలిపాడాయన.