మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను రాజమౌళి.. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో ఓ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందించనున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ‘ఎస్ఎస్ఎంబీ౨౯’కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
అదేంటంటే.. మహేశ్తో తీస్తున్న ఈ చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ జంతువులను వాడుతారట. “నాకు జంతువులంటే ఇష్టం. ‘ఆర్ఆర్ఆర్’ సహా నేను తీసిన చిత్రాలన్నింటిలో జంతువులను ఉపయోగించా. నా తదుపరి చిత్రంలోనూ ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ జంతువులను వాడుతాను” అని రాజమౌళి తెలిపారు. దీంతో ఈవెంట్కు వేదికైన ఆడిటోరియం మొత్తం సందడిగా మారిపోయింది.
ఈ సినిమా కోసం రాజమౌళి అద్భుతమైన విజువల్స్ అందించి ‘ఏ స్టూడియో’ అనే హాలీవుడ్ సంస్థతో జత కట్టారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొచ్చే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. అడ్వెంచర్ జానర్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని విదేశీ భాషల్లోనూ రూపొందించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.