calender_icon.png 25 September, 2024 | 8:04 AM

స్వయంగా చెప్పాలనుకున్నా.. కుదరలేదు!

25-09-2024 03:18:06 AM

అలనాటి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలో తెలుగు తెరపై తొలిసారి మెరవనుంది. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి ’దేవర’ చిత్రం ద్వారా ఈ అభినవ అతిలోక సుందరి ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. ’దేవర’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండటంతో ఈ మధ్యే 

తమిళంలో అనర్గళంగా మాట్లాడి ఆశ్చర్యపరిచిన జాన్వీ.. తెలుగు భాషపై కూడా తనకు ఎంతటి పట్టు ఉందో చూపించే ప్రయత్నం చేసింది. తాను తెలుగులో మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘అందరికి నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి, నామీద ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్, నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు.

మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజూ కష్టపడతాను. దేవర నా తొలి అడుగు. శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఈ మూవీకి ఎంచుకోవడం నా అదృష్టం.

మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని చెప్పింది. ఈ వీడియోతోపాటు జాన్వీ లంగాఓణీలో చేసిన ఫొటోషూట్‌ను పోస్ట్ చేస్తూ.. ‘నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న. ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఈ చిన్న మెసేజ్. సెప్టెంబర్ 27న థియేటర్లలో కలుద్దాం‘ అని తెలుగులో క్యాప్షన్ ఉంచడం విశేషం.