calender_icon.png 25 October, 2024 | 8:57 AM

11 గంటలు దాటినా సారు జాడ లేదు!

29-08-2024 12:05:58 AM

వ్యవసాయ అధికారుల తీరుపై రైతుల అసహనం

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 28 (విజయక్రాంతి): రుణమాఫీకానీ రైతులు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భరోసా ఇస్తూనే.. రుణమాఫీకానీ రైతులు మండల వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని చెప్పారు. అయితే ఇబ్ర హీంపట్న మండలంలో రుణమాఫీకానీ రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించేందుకు బుధవారం ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. ఉదయం 11 గంటలు దాటి నా అధికారులు, సిబ్బంది రాకపోవడంతో ఆఫీ సు తాళాలు తెరుచుకోలేదు. దీంతో రైతులు కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తూ సిబ్బంది తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.