calender_icon.png 28 September, 2024 | 7:02 AM

సీనియర్ జర్నలిస్ట్ మృతి.. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

26-09-2024 12:08:29 PM

హైదరాబాద్: ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టీ. ఆదినారాయణ కన్నుమూశారు. అపార్టుమెంట్ పై వాకింగ్ చూస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. పైనుంచి జారీపడటంతో సమీప ఆస్పత్రికి తరలించారు.  ఈటీవీ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆకస్మిక మృతి బాధాకరమని ఒక సందేశంలో పేర్కొన్నారు. భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు ఆదినారాయణ మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆదినారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 25 ఏళ్లుగా ఆదినారాయణ ఈటీవీలో పనిచేస్తున్నారు.